బ్యాంకుల ద్వారా లాభాంశాల (డివిడెండ్) ప్రకటన
ఆర్బిఐ/2021-22/23 ఏప్రిల్ 22, 2021 అన్ని వాణిజ్య బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు మేడమ్/సర్, బ్యాంకుల ద్వారా లాభాంశాల (డివిడెండ్) ప్రకటన దయచేసి డిసెంబర్ 4, 2020 నాటి మా సర్క్యులర్ DOR.BP.BC.No.29/21.02.067/2020-21, మరియు సంబంధిత అంశాలపై ఇతర అనుబంధ సర్క్యులర్లను చూడండి. 2. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 యొక్క రెండవ తరంగం వలన కొనసాగుతున్న అనిశ్చితి దృష్ట్యా, బ్యాంకులు స్థితిస్థాపకంగా ఉండడం మరియు ఊహించని నష్టాలకు వ్యతిరేకంగా మూలధనాన్ని ఒక గోడలా ముందస్తుగా పెంచుకోవడం మరియు పరిరక్షించడం చాలా ముఖ్యం. అందువల్ల, ఈక్విటీ షేర్లపై లాభాంశం చెల్లించడానికి బ్యాంకులను అనుమతించేటప్పుడు, మార్చి 31, 2021 తో ముగిసిన సంవత్సరానికి లాభాంశం ప్రకటన నిబంధనలను ఈ క్రింది విధంగా సమీక్షించాలని నిర్ణయించారు. వాణిజ్య బ్యాంకులు 3. మే 4, 2005 నాటి సర్క్యులర్ DBOD.NO.BP.BC.88/21.02.067/2004-05 లో ఉన్న సూచనల పాక్షిక సవరణలతో బ్యాంకులు మార్చి31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి లాభాల నుండి ఈక్విటీ షేర్లపై ఫై సర్క్యులర్ యొక్క 4 వ పేరాలో సూచించిన లాభాంశం చెల్లింపు, నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన మొత్తంలో లాభాంశం యొక్క పరిమాణం యాభై శాతానికి మించకుండా, లాభాంశం చెల్లించవచ్చు. మే 4, 2005 నాటి సర్క్యులర్లోని ఇతర సూచనలు యధావిధిగా కొనసాగుతాయి. సహకార బ్యాంకులు 4. అమలులో వున్న సూచనల ప్రకారం మార్చి 31, 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరం లాభాల నుండి ఈక్విటీ షేర్లపై లాభాంశం చెల్లించడానికి సహకార బ్యాంకులకు అనుమతి ఉంటుంది. జనరల్ 5. అన్ని బ్యాంకులు లాభాంశం చెల్లింపు తర్వాత వర్తించే కనీస నియంత్రణ మూలధన అవసరాలను తీర్చడం కొనసాగించాలి. ఈక్విటీ షేర్లపై లాభాంశం ప్రకటించినప్పుడు, వర్తించే మూలధన అవసరాలు మరియు నిబంధనల యొక్క సమర్ధతను పరిగణనలోకి తీసుకొని, బ్యాంక్ యొక్క ప్రస్తుత మరియు అంచనా వేసిన మూలధన స్థితిని, ఆర్థిక పరిస్థితులు మరియు లాభదాయకత యొక్క దృక్పథం పరిగణనలోకి తీసుకోవడం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాధ్యత. మీ విధేయులు, (ఉషా జానకిరామన్) |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: